![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'( Illu illalu pillalu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -175 లో.....చందు ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి మాటలు గుర్తుచేసుకుంటాడు. అప్పుడే సాగర్ వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య అంటాడు. నీకు ఇది వరకే చెప్పాను.. నీ భార్య నా భార్య విషయంలో కలుగజేసుకోకని చెప్పమని.. అయిన తన మాటలతో నా భార్యని బాధపెడుతుంది. ఇప్పుడు తన చెల్లి వస్తే కూడా అలాగే బాధపెట్టారట అని సాగర్ తో చందు అంటాడు. అప్పుడే దీరజ్ వస్తాడు.
మొన్న ట్యూషన్ విషయంలో కూడా వదిన జోక్యం చేసుకుంది. ఏమైనా అంటే ఇంటికి పెద్ద కోడలు అంటుంది. అందరి గురించి పట్టించుకుంటున్నపుడు తన గురించి కూడా ఇంట్లో వాళ్ళు జోక్యం చేసుకుంటారు కదా అని ధీరజ్ అనగానే.. నేను అన్నది నాకే చెప్తున్నావా.. ఇన్ని రోజులు ఆ మాటలు మనసులో పెట్టుకున్నావా.. బాగా అర్ధమవుతుందిరా.. ప్రేమ, నర్మద ఒకటి అందుకే మీరిద్దరూ ఒకటి అయ్యారా అని చందు అంటాడు. అప్పుడే వేదవతి వచ్చి ఒరేయ్ ఇలా తయారయ్యారేంటి.. ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా అయ్యారు.. మీరు గొడవ పెట్టుకోనని మాటివ్వండి అని వేదవతి అంటుంది. అందరు సైలెంట్ గా వెళ్ళిపోతారు.ఆ తర్వాత వేదవతి దగ్గరికి రామరాజు వచ్చి. ఇంట్లో సిచువేషన్ ఎలా ఉందని అడుగుతాడు. అసలు బాలేదు.. ఇప్పుడు వాళ్ళ మధ్య దూరం పెరుగుతున్నట్లనిపిస్తుందని వేదవతి అంటుంది. ఇంత మంది ఉన్న దగ్గర అవి జరుగుతూనే ఉంటాయని రామరాజు అంటాడు.
మరొకవైపు ధీరజ్ ను ఉహించుకుంటూ ప్రేమ ఊహల్లో తెలిపోతుంది. ప్రొద్దున నిద్రలేచి.. అసలు నా మనసు ఎందుకిలా ఉంది.. నిజంగానే ధీరజ్ ని లవ్ చేస్తున్నానా అని పేపర్ పై ఇద్దరి పేర్లు రాసి ఫ్లేమ్స్ వేస్తుంది. అందులో లవ్ అని రావడంతో ప్రేమ సిగ్గుపడుతుంది. ధీరజ్ నిద్ర లేచి ఇంత ప్రొద్దున నిద్రలేచి ఏం చేస్తున్నావ్.. ఆ పేపర్ లో ఏముందని అడుగుతాడు ఏం లేదు. ఇవి నా బుక్స్ అని ప్రేమ అంటుంది. ఏదో తేడాగా బెహేవ్ చేస్తున్నావని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |